News January 26, 2025
సిరిసిల్ల: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 8, 2025
ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!

అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ క్యాండిడేట్ చంద్రభాను పాస్వాన్ 61,710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఓటమి తర్వాత ఈ విజయంతో బీజేపీకి ఊరట దక్కింది. మరోవైపు తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థి ఛాందీరకుమార్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News February 8, 2025
BJP విజయానికి అసదుద్దీన్, MIM హెల్ప్!

BJP విజయంలో MIM పరోక్షపాత్రపై చర్చ జరుగుతోంది. ఆమ్ఆద్మీని మట్టికరిపించడంలో అసదుద్దీన్ ప్రభావం తోడైందంటున్నారు. ఢిల్లీలో ముస్లిములు గణనీయంగా ఉంటారు. ఒకప్పుడు కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్న వీరు పదేళ్లుగా AAPకు ఓటేస్తున్నారు. ఈసారి పార్టీలన్నీ పొత్తుల్లేకుండా బరిలోకి బలమైన అభ్యర్థులనే దించడంతో ముస్లిముల ఓట్లు చీలాయి. MIMకు మొత్తం 80వేల ఓట్లు రావడం స్వల్ప మార్జిన్లతో చాలాచోట్ల BJPని గెలిపించింది.