News March 22, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎండలు కొడుతూనే వర్షాలు..

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు ఎండలు కొడుతూనే మరోవైపు పలు మండలాలలో వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 37.6°c, ఇల్లంతకుంట 37.6°c, తంగళ్ళపల్లి 37.5°c, గంభీరావుపేట 37.5°c, సిరిసిల్ల 37.4 °c,చందుర్తి 37.2°c, వేములవాడ 37.1°c, ఎల్లారెడ్డిపేట 35.8 °c లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News November 27, 2025

బోయినపల్లి: ‘ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

image

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News November 27, 2025

భారీ సైబర్ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులు

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని భయపెట్టి రూ.1.62 కోట్లు దోచుకున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ.1,05,300 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై సీబీఐ అధికారులుగా నటిస్తూ వాట్సాప్‌లో బెదిరించినట్లు మీడియాకు తెలిపారు. ఇంతటి భారీ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులను ఎస్పీ అభినందించారు.

News November 27, 2025

ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలి: ADB SP

image

బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి సూచించారు. గురువారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలన్నారు. పట్టణంలో బీట్ సిస్టం సక్రమంగా అమలు చేయాలని, దీని ద్వారా నేరాల నియంత్రణ దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని వివరించారు.