News April 3, 2025
సిరిసిల్ల జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. వీర్నపల్లి 36.9 °c, గంభీరావుపేట 36.8°c, కోనరావుపేట 36.3, సిరిసిల్ల 36.2, ఇల్లంతకుంట 36.0°c, బోయిన్పల్లి 36.1°c, చందుర్తి 35.2°c, రుద్రంగి 35.0 డిగ్రీలుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం పలు మండలాలలో మేఘాలు కమ్ముకుపోయి చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి.
Similar News
News February 23, 2026
పల్నాడులో ఇంటర్ పరీక్షలకు కౌంట్డౌన్..!

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతి లేదని పేర్కొన్నారు.
News February 23, 2026
చేవెళ్ల: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..!

చేవెళ్లలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. 2018లో ప్రేమవివాహం చేసుకున్న రాజేశ్వరి, కృష్ణ చంద్రారెడ్డినగర్లో ఉంటున్నారు. 6 నెలల క్రితం భార్యకు ఇన్స్టాగ్రాంలో శరత్తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి రాజేశ్వరి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News February 23, 2026
నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో PGRS

జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.


