News April 3, 2025

సిరిసిల్ల జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎండ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. వీర్నపల్లి 36.9 °c, గంభీరావుపేట 36.8°c, కోనరావుపేట 36.3, సిరిసిల్ల 36.2, ఇల్లంతకుంట 36.0°c, బోయిన్పల్లి 36.1°c, చందుర్తి 35.2°c, రుద్రంగి 35.0 డిగ్రీలుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం పలు మండలాలలో మేఘాలు కమ్ముకుపోయి చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి.

Similar News

News November 17, 2025

తిరుచానూరులో శ్రీవారు తపస్సు చేశారని తెలుసా?

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పద్మసరోవరానికి తూర్పువైపున శ్రీసూర్య నారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీనివాసుడు స్వయంగా సూర్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి మహాలక్ష్మీ కోసం తపస్సు చేశారు. 12 ఏళ్ల తర్వాత బంగారు పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అనేకసార్లు పునరుద్ధరించారు. 1866 ఏప్రిల్ 23న హథీరాంజీ మఠం వారు జీర్ణోద్ధరణ చేశారు.

News November 17, 2025

వరంగల్: డా.చిట్టిబాబు ఇంటిపై సోదాలు

image

వరంగల్ జిల్లా ఖానాపురం(M)లో అర్షమొల ఆపరేషన్ వికటించిన ఘటనపై దర్యాప్తు వేగం పెంచిన అధికారులు, ఖానాపురంలో నకిలీ వైద్యుడు బైరూ చిట్టిబాబు ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన డైక్లోఫెనాక్, జెంటమైసిన్, డెక్సామెతాసోన్ సహా పలు ఇంజెక్షన్లు, పాత శస్త్రపరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న చిట్టిబాబుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2025

ఒకేసారి రెండు సీక్వెల్స్‌లో తేజా సజ్జ!

image

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్‌ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్‌పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.