News April 13, 2025

సిరిసిల్ల జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.234, కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.206,  కేజీ చికెన్ బోన్ లెస్ రూ.434, కేజీ చికెన్ రిటైల్ రూ.142, కేజీ కోడి లైవ్ బర్డ్ రూ.120, కేజీ చికెన్ హోల్ సేల్ రూ.125, 100 కొడిగుడ్లకు 390 రూపాయలుగా ఉన్నట్లు మార్కెట్లోని షాపు యజమానులు తెలిపారు.

Similar News

News February 24, 2026

విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మురళి నగర్ జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న వ్యక్తిని విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడకక్కడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 24, 2026

పంటల్లో బోరాన్ లోపం – కనిపించే లక్షణాలు

image

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపం వల్ల మొక్కల చిగుర్లు వికృతాకారంలో
మారతాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి.

News February 24, 2026

హనుమకొండ హసన్‌పర్తిలో మర్డర్..!

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో సోమవారం రాత్రి మర్డర్ జరిగింది. గ్రామానికి చెందిన బాల్నే మొగిలి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి కత్తులు, గొడ్డలితో వచ్చి మొగిలిని దారుణంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది. హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.