News April 13, 2025

సిరిసిల్ల జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.234, కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.206,  కేజీ చికెన్ బోన్ లెస్ రూ.434, కేజీ చికెన్ రిటైల్ రూ.142, కేజీ కోడి లైవ్ బర్డ్ రూ.120, కేజీ చికెన్ హోల్ సేల్ రూ.125, 100 కొడిగుడ్లకు 390 రూపాయలుగా ఉన్నట్లు మార్కెట్లోని షాపు యజమానులు తెలిపారు.

Similar News

News November 5, 2025

అసెంబ్లీ స్పీకర్ ముందుకు రేపు జగిత్యాల MLA సంజయ్

image

పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ విడతలవారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుంచి రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు స్వీకరించనున్నారు. ఈ మేరకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను గురువారం విచారించనున్నారు. ఇరువర్గాల అడ్వకేట్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది.

News November 5, 2025

వరి మాగాణుల్లో నువ్వులు, ఆవాలు ఎప్పుడు చల్లుకోవాలి?

image

రాయలసీమ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో వరి కోసే 10 రోజులకు ముందు ఆవాలు, నువ్వుల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. ఆవాలు ఎకరాకు 1 నుంచి 1.5కిలోలు, నువ్వులు ఎకరాకు 1.5 నుంచి 2 కిలోలు అవసరం. ఆవాల విత్తనాలను 5-6 కిలోల సన్నని ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా వెదజల్లాలి. ఆ సమయంలో బురద పదునులో విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. నువ్వుల విత్తనాలను 1.5kg బియ్యపు నూకలతో కలిపిచల్లితే సమానంగా పొలంలో పడతాయి.

News November 5, 2025

కాసేపట్లో వర్షం..

image

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.