News April 12, 2025
సిరిసిల్ల జిల్లాలో భానుడు భగభగ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సిరిసిల్ల 41.4 °c,రుద్రంగి 41.3 °c, ఇల్లంతకుంట 41.2 °c,వీర్నపల్లి 41.1°c, గంభీరావుపేట 40.9 °c,వేములవాడ రూరల్ 40.9°c, కోనరావుపేట 40.4 °c,ఎల్లారెడ్డిపేట 40.2 °c,బోయిన్పల్లి 40.1°c,ముస్తాబాద్ 39.9 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతవరణశాఖ ఆరెంజ్ జోన్ ప్రకటించింది.
Similar News
News September 14, 2025
రైతులకు అండగా ఉంటాం: బాపట్ల కలెక్టర్

రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శనివారం బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీ తీరును పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని సకాలంలో యూరియా అందించే విధంగా చర్యలు చేపడతామని భరోసా కల్పించారు. యూరియా పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 14, 2025
కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులకు కొత్త ప్రతిపాదనలు

వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంతో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సూచించిన కొత్త రైల్వే ప్రాజెక్టు ఎలైన్మెంట్తో DPR రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు.
News September 14, 2025
నిర్మల్: ‘లోక్ అదాలత్తో శాశ్వత పరిష్కారం’

లోక్ అదాలత్తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి సుజన కళాసికం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వరకట్నం, గృహహింస, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులను తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఎస్పీ, కలెక్టర్, జిల్లా జడ్జి తదితరులు పాల్గొన్నారు.