News March 7, 2025
సిరిసిల్ల జిల్లాలో మార్నింగ్ ఉష్ణోగ్రతల అప్డేట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటలలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా నమోదు అయ్యాయి. గంభీరావుపేట 35.0°c, వీర్నపల్లి 35.0°c ఉన్నాయి. ఇలా ఉండగా ఎండలు కొడుతూనే చలి మండలాలు సిరిసిల్ల 34.9°c, కోనరావుపేట 34.5°c, వేములవాడ 34.5°c, ఎల్లారెడ్డిపేట 34.0°c, రుద్రంగి 34.0°c, ఇల్లంతకుంట 34.0°c, చందుర్తి 33.3°c, బోయిన్పల్లి 33.2°c లుగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News November 25, 2025
కడప జిల్లా హెడ్ క్వార్టర్కు ప్రొద్దుటూరు సీఐ..!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్కి పంపినట్లు సమాచారం.
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
News November 25, 2025
GNT: సంక్రాంతి రైళ్లకు ఇప్పుడే వెల్లువ.!

వచ్చే ఏడాది సంక్రాంతి రద్దీ ప్రభావం ముందే కనిపిస్తోంది. రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు తెరవడంతో ప్రధాన రైళ్లలో బెర్తులు పూర్తిగా నిండిపోయాయి. పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్లు శతకానికి ఎగబాకగా, కొన్నింటిలో నోరూమ్ సందేశాలు దర్శనమిస్తున్నాయి. హౌరా, సికింద్రాబాద్, బెంగళూరు మార్గాల్లో డిమాండ్ అధికం. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ముందుగానే బుకింగ్ చేసుకోవడంతో పరిస్థితి మరింత కఠినమైంది.


