News March 26, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుధవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6767 మంది విద్యార్థులకు 6750 విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాలేదని తెలిపారు.
Similar News
News December 8, 2025
భద్రాచలం: అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలి: ఎస్పీ

భద్రాచలం బ్రిడ్జి వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలైన్స్ టీం) చెక్ పోస్ట్ను ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ పూర్తయ్యే వరకు చెక్ పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు.
News December 8, 2025
రాయికల్: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూములకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
News December 8, 2025
ఏజెంట్ స్పేస్లో డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని అన్ని శాఖల వారు ఏజెంట్ స్పేస్లో డాక్యుమెంట్ అప్లోడ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఇప్పటివరకు సర్వే శాఖ లక్షకు పైగా, కలెక్టరేట్ ద్వారా 55 వేలు మాత్రమే అప్లోడ్ చేశారని ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ దేవాదాయ, వాణిజ్య పన్నులు, కాలుష్య నియంత్రణ, విద్యాశాఖ, టౌన్ ప్లానింగ్, మైనారిటీ సంక్షేమ శాఖ, తదితర శాఖలు ఒక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయలేదని, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.


