News March 26, 2025

సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుధవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6767 మంది విద్యార్థులకు 6750 విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాలేదని తెలిపారు. 

Similar News

News April 2, 2025

ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

image

పీఎం ఆవాస్ యోజన – ఎన్టీఆర్ కాలనీల గృహనిర్మాణ పథకంలో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులకు బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు అందించి, నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

News April 2, 2025

ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలి: ఎంపీ మిథున్ రెడ్డి

image

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్ర‌త్యేక‌ రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయ‌ని, భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి రాసిన లేఖ‌లో కోరారు.

News April 2, 2025

బీసీల డిమాండ్‌ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

image

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

error: Content is protected !!