News March 28, 2025

సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 విద్యార్థులు పరీక్ష రాశారు. 14 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని తెలిపారు.

Similar News

News October 19, 2025

ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

image

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్‌లోని ఆలమనగర్‌లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.

News October 19, 2025

కేసీఆర్ తపనతో టెక్స్‌టైల్ పార్కుకు అంకురార్పణ: KTR

image

స్వరాష్ట్రంలో ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని, మన బిడ్డలకు కొలువులు దొరకాలనే కేసీఆర్ తపనతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు అంకురార్పణ జరిగిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ ప్రస్తుతం గణేశా, గణేశా ఎకోస్ఫియర్, యంగ్‌వన్‌, కిటెక్స్‌ సంస్థలు తమ తమ యూనిట్లను మొదలుపెట్టాయని, తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం టెక్స్‌టైల్ పార్క్ అని అన్నారు.

News October 19, 2025

జనగామ: ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి: డీఆర్డీవో

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న కార్మికులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని డీఆర్డీవో వసంత సూచించారు. ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉన్నందున జాబ్ కార్డుదారులు స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించి ఈకేవైసీ చేసుకోవాలని ఆమె కోరారు.