News April 5, 2025
సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్ గీతే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 28, 2025
నిర్మల్: ‘పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

నిర్మల్ జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీసీఐ సమయానికి కొనుగోళ్లు ప్రారంభించి రైతుల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
News October 28, 2025
CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
News October 28, 2025
134 మంది గర్భిణులు ఆసుపత్రికి తరలింపు: కలెక్టర్

మొంథా తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులు, నిరాశ్రయుల రక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి సూచనల మేరకు 134 మంది గర్భిణులను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 5,407 మందిని 119 పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించామన్నారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.


