News February 5, 2025
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రెడ్డి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంఘం నాయకులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 22, 2026
ఈ ఫుడ్స్ తింటే పదేళ్లు యంగ్గా కనిపిస్తారు

చర్మానికి లోపలి నుంచి పోషణ అందిస్తే ఎక్కువ కాలం యంగ్గా కనిపించొచ్చని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ఉసిరికాయల్లో ఉండే కొల్లాజెన్ స్కిన్ను ముడతలు పడకుండా, సాగిపోకుండా కాపాడుతుంది. దానిమ్మగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ప్రాబ్లమ్స్ను దూరం చేస్తాయి. వాల్నట్స్లో ఉండే విటమిన్ ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ను యవ్వనంగా మారుస్తాయి. రోజూ 4-5 నానబెట్టిన బాదంపప్పులు తింటే చర్మం మెరుస్తుంది.
News January 22, 2026
ఖల్లీకోట్ స్టేషన్లో ఆగనున్న విశాఖ-హౌరా, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఖల్లీకోట్ రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మక హాల్ట్ను కల్పిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), సికింద్రాబాద్-హౌరా (12704) రైళ్లు, అలాగే 27 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), హౌరా-సికింద్రాబాద్ (12703) రైళ్లు ఖల్లీకోట్ స్టేషన్లో ఆగనున్నాయని తెలిపారు.
News January 22, 2026
గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.


