News February 4, 2025
సిరిసిల్ల: జిల్లా BJP అధ్యక్షుడు ఎవరో..?

బీజేపీ నూతన అధ్యక్షుల ప్రకటనలో భాగంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. మిగతా 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. రెడ్డి, మున్నూరు కాపులకు 6, 4-గౌడ్స్, వైశ్య, ఎస్సీలకు 2, కమ్మ, ఆర కటిక, పద్మశాలీ, పెరిక, ముదిరాజ్లకు 1 చొప్పున BJP అధ్యక్షులను నియమించింది. అయితే ఇప్పటివరకు సిరిసిల్ల అధ్యక్షుడినైతే ప్రకటించలేదు.కాగా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 7, 2026
జగిత్యాల: భవిత కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

జగిత్యాలలోని భవిత కేంద్రాన్ని DMHO డాక్టర్ సుజాత ఆకస్మికంగా సందర్శించారు. డిఫరెంట్ ఏబుల్డ్ చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించి, అవసరమైతే శస్త్రచికిత్సలు, ప్రతివారం ఫిజియోథెరపీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిత కేంద్రం నిర్వాహకులు రాజేందర్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆర్బీఎస్కే వైద్యులు డాక్టర్ సురేందర్, డాక్టర్ విద్య, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News January 7, 2026
బోయినపల్లి: యువకుడిపై కత్తితో దాడి

బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సావనపల్లి శశిప్రీతం అనే యువకుడిపై శ్రీధర్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగింది. ఆ తర్వాత ఇద్దరం రాజీ పడదామని అంగీకారానికి వచ్చి ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వాహనం వెనుక కూర్చున్న శ్రీధర్.. శశి ప్రీతంపై కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
News January 7, 2026
సిరిసిల్ల: అటవీ శాఖ రేంజ్ అధికారి సస్పెన్షన్

సిరిసిల్ల అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినిపై దురుసుగా ప్రవర్తించగా.. ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు ఎఫ్ఆర్ఓ శ్రీహరి ప్రసాద్ను బుధవారం సస్పెండ్ చేశారు.


