News January 26, 2025
సిరిసిల్ల: జెండాను ఆవిష్కరించిన ఎస్పీ

సిరిసిల్లలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు చేసిన కృషి ఫలితంగానే మనకు రాజ్యాంగం అవతరించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పిలు శేషాద్రి రెడ్డి, చంద్రయ్య, డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, మురళీకృష్ణ, ఆర్ఐలు రమేష్, మధుకర్, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
Similar News
News November 4, 2025
నేపాల్లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్పై సుప్రీంకోర్టు

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.
News November 4, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

➤పాపం పసి ప్రాణం.. పుట్టడమే శాపమా ?
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 52 అర్జీలు
➤శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల పూజలు
➤గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి: అచ్చెన్న, రామన్న
➤శ్రీకాకుళం: 80సార్లు అర్జీలిచ్చాం..అడుగు రోడ్డు వేయలేదు
➤దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు: హిరమండలం ఎస్సై
➤ హామీ అమలుతో శ్రీకాకుళం జిల్లాలో 1,350 మందికి మేలు
News November 4, 2025
రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.


