News January 26, 2025

సిరిసిల్ల: జెండాను ఆవిష్కరించిన ఎస్పీ

image

సిరిసిల్లలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు చేసిన కృషి ఫలితంగానే మనకు రాజ్యాంగం అవతరించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పిలు శేషాద్రి రెడ్డి, చంద్రయ్య, డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, మురళీకృష్ణ, ఆర్ఐలు రమేష్, మధుకర్, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Similar News

News December 5, 2025

కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

image

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.

News December 5, 2025

కుడా భవనం ఆ అల్లుడి కోసమేనా..?

image

కుడా భవనంను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్దమైంది. ప్రభుత్వ డబ్బులతో కట్టిన బిల్డింగ్‌ను, నిర్వహణ భారం పేరిట ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడానికి ఈనెల 15వ తేదీని టార్గెట్‌గా నిర్ణయించారు. కుడా కార్యాలయంలోని 8 విభాగాలను, ప్రధాన కార్యాలయాన్ని, కాళోజీ కళా క్షేత్రానికి తరలించాలని నిర్ణయించారు. లీజ్ పేరిట ప్రస్తుత కుడా కార్యాలయాన్ని ఓ నేత అల్లుడికి ఆసుపత్రి కోసం ఇస్తున్నట్టు సమాచారం.

News December 5, 2025

ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

image

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.