News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.
Similar News
News December 2, 2025
HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్కు చెందిన ధనుంజయ్ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా
News December 2, 2025
జగిత్యాల సర్పంచ్కి 508.. కరీంనగర్ సర్పంచ్కి 431

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్లో రెండోవిడతలో 418 GPలకు, 3794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండో విడతకు సంబంధించి రెండోరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా సర్పంచ్కి 431, వార్డు సభ్యులకు 1287, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 311, వార్డు సభ్యులకు 692, జగిత్యాల సర్పంచ్కి 508, వార్డు సభ్యులకు 1279, PDPL సర్పంచ్కి 295, వార్డు సభ్యులకు 810 నామినేషన్లు వచ్చాయి.
News December 2, 2025
నల్గొండ: గ్రామాల్లో అంతర్గత పోరుతో రాజకీయ హీట్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానుండడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీ నుంచి పలువురు నేనే సర్పంచ్ అంటూ బరిలో దూసుకురావడంతో అంతర్గత పోరు మొదలైంది. ఇతర పోస్టులు సర్దుబాటు చేస్తామని నేతలు బుజ్జగిస్తున్నా వినకుండా స్వతంత్రగానైనా పోటీ చేస్తామంటూ సిద్ధం కోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.


