News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.
Similar News
News March 14, 2026
రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

భారత్లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్లో నిలిచాయి.
News March 14, 2026
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 45 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 4,156 మంది బాలురు, 4001 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు అరగంట ముందే చేరుకోవాలన్నారు.కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు.
News March 14, 2026
గ్యాస్ సరఫరాపై నిరంతర నిఘా: కలెక్టర్

సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


