News March 18, 2025

సిరిసిల్ల: ట్రాక్టర్ ఢీకొని గొర్ల కాపరి మృతి

image

బోయినపల్లి నుంచి వేములవాడ వెళ్లే రహదారిలో గల పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి  మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన సుంకానీ మల్లేశం అనే గొర్ల కాపరి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పెట్రోల్ బంకు వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 26, 2025

సిద్దిపేట: కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం

image

సిద్దిపేట జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై, కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం ప్రాధాన్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

News November 26, 2025

అటవీ పరిరక్షణకు కమ్యూనిటీల మద్దతు అవసరం: డీఎఫ్‌ఓ

image

అటవీ సంరక్షణ చర్యలలో కమ్యూనిటీలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) భాగస్వామ్యం కావడాన్ని డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ (ఐఎఫ్ఎస్) స్వాగతించారు. ఖమ్మం అటవీ శాఖతో కలిసి పనిచేయడానికి వాలంటీర్లు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ భాగస్వామ్యం వలన పరిరక్షణ చర్యలు మరింత బలోపేతం అవుతాయని డీఎఫ్‌ఓ తెలిపారు.

News November 26, 2025

పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

image

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.