News February 27, 2025

సిరిసిల్ల: తంగళ్లపల్లి, చందుర్తి, రుద్రంగి అత్యధికం, బోయినపల్లిలో అత్యల్పం

image

సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో తంగళ్లపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాలలోని పోలింగ్ కేంద్రాలలో అత్యధికంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బోయిన్ పల్లిలో 78.26 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

image

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

News November 17, 2025

ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

image

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.