News February 27, 2025

సిరిసిల్ల: తంగళ్లపల్లి, చందుర్తి, రుద్రంగి అత్యధికం, బోయినపల్లిలో అత్యల్పం

image

సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో తంగళ్లపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాలలోని పోలింగ్ కేంద్రాలలో అత్యధికంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బోయిన్ పల్లిలో 78.26 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

GNT: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

image

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.

News October 22, 2025

2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

News October 22, 2025

ఎస్.ఆర్.శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

image

ప్రజల అధికారిగా ఎస్.ఆర్. శంకరన్ ప్రసిద్ధి చెందారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శంకరన్ జయంతిని కలెక్టర్ కార్యాలయలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు చేసి నివాళులు అర్పించారు. ప్రజలతో కలిసిమెలసి పని చేసిన వ్యక్తి శంకరన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి శంకరన్ తన జీవితాన్ని అంకితం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.