News April 13, 2025

సిరిసిల్ల : నాలుగోతరగతి పరీక్షల్లో ఆసక్తికర సమాధానం రాసిన విద్యార్థిని

image

రాజన్న సిరిసిల్ల(D) చందుర్తి(M)లోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికర సమాధానం రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది, నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో పేపర్ దిద్దిన టీచర్ ఆశ్చర్యపోయారు. నేటికాలంలో కోడళ్ళకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో ఈ లేఖ తెలియజేస్తోంది.

Similar News

News September 16, 2025

మెట్రోతో నష్టాలు.. వాటాలను అమ్మేస్తాం: L&T

image

TG: హైదరాబాద్ మెట్రోతో తీవ్రంగా నష్టపోయామని, తమ వాటాలను విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ఎల్ అండ్ టీ ప్రకటించింది. కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిందని, నికర నష్టం రూ.626 కోట్లకు చేరిందని పేర్కొంది. దీంతో మెట్రో విస్తరణలో పాల్గొనలేమని ప్రకటించింది. కాగా వర్క్ ఫ్రం హోం, ట్రావెల్ కల్చర్‌లో మార్పులు వంటి కారణాలతో మెట్రో ప్రయాణికులు తగ్గినట్లు సమాచారం.

News September 16, 2025

వివిధ సంస్థలు- వ్యవస్థాపకులు

image

* మైక్రోసాఫ్ట్- బిల్‌గేట్స్, పాల్ అలెన్
*యాపిల్-స్టీవ్‌జాబ్స్, వోజ్నియాక్, రోనాల్డ్ వెయిన్
*యాహూ -జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో
*గూగుల్ -లారీపేజ్, సెర్గీబ్రిన్
*లింక్‌డ్ ఇన్- రోడ్ హాఫ్‌మన్, ఎరిక్‌లీ, అలెన్ బ్లూ
*ఫేస్‌బుక్- మార్క్ జుకర్‌బర్గ్
*యూట్యూబ్- చాడ్ హర్లీ, స్టీవ్‌చెన్, జావెద్ కరీం
*ట్విటర్-జాక్ డార్సీ, నోగ్లాస్, బిజ్‌స్టోన్, ఇవాన్ విలియమ్స్
*వాట్సాప్- జాన్ కౌమ్, ఆక్టన్

News September 16, 2025

గుంటూరు: మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

image

మెగా డీఎస్సీకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1140 మంది అభ్యర్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. రిజర్వేషన్ల కారణంగా ఖాళీగా మిగిలిన 19 పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈనెల 19న అమరావతిలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.