News April 15, 2025
సిరిసిల్ల: నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు ఉండవద్దన్నారు.
Similar News
News December 1, 2025
కృష్ణా: నవోదయలో 21 మంది విద్యార్థులు సస్పెండ్.. కారణమిదే.!

వేలేరు నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థులు అర్ధరాత్రి సాహసం చేసి సస్పెండయ్యారు. రాత్రి 10 గంటల తర్వాత హాస్టల్లోని ఎగ్జిట్ ఫ్యాన్ బెజ్జం తీసి, చిన్న రంధ్రం గుండా బయటపడ్డారు. హనుమాన్ జంక్షన్-నూజివీడు రోడ్డుకు వెళ్లి బిర్యానీ తెచ్చుకున్న ఈ విద్యార్థులను గుర్తించిన ప్రిన్సిపల్ తీవ్రంగా స్పందించి, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.
News December 1, 2025
నల్గొండ: గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో జిల్లా మంత్రులు

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ను పరిచయం చేస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంతో కలిసి వారు ఆవిష్కరించారు.
News December 1, 2025
అల్లూరి జిల్లాలో ఈనెల 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పాఠశాల లాగిన్, మనమిత్ర వాట్సాప్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.


