News March 15, 2025

సిరిసిల్ల: నీటి సరఫరాకు అంతరాయం: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

image

సిరిసిల్లలోని 120MLD నీటి శుద్ధి కేంద్రంలోని తాగునీరు నీటి పంపు హౌస్‌లో పంపుల మరమ్మతు జరుగుతున్నందున ఈనెల 16న సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE శేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ఈనెల 17వ తేదీన నీటి సరఫరా యథావిధిగా సాగుతుందని ప్రజలు సహకరించాలన్నారు.

Similar News

News October 29, 2025

జగిత్యాల: ST యువతకు ఉపాధి అవకాశాలు

image

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువతీయువకులకు ఆన్‌లైన్ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే.రాజ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఆసక్తిగల ఎస్టీ నిరుద్యోగులు https://deet.telangana.gov.in వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News October 29, 2025

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

image

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం

News October 29, 2025

సిద్దిపేట: ‘దరఖాస్తు తేదీ పొడిగింపు’

image

2025-2026 విద్యా సంవత్సరానికి మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించినట్లు సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అహ్మద్ తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కళాశాలలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 31 వరకు గడువు పొడగించామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.