News January 28, 2025

సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ

image

బ్యాంకుల వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని అదనపు ఎస్పీ డి.చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంల భద్రతపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం సిస్టం అందుబాటులో ఉండాలన్నారు. బ్యాంకు కార్యాలయాలు, ఏటీఎం సెంటర్ల వద్ద తప్పనిసరిగా పనిచేసే సీసీ కెమెరాలు ఉండాలని సూచించారు.

Similar News

News November 20, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 20, 2025

NZB: అర్ధరాత్రి వరకు కొనసాగిన ACB సోదాలు (UPDATE)

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో నిన్న <<18329466>>ACB సోదాలు<<>> జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. టౌన్ ప్లానింగ్‌లో పలువురి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ సోదాలు జరిగాయి. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

News November 20, 2025

బస్సెక్కుతుండగా.. రూ.15 లక్షల విలువైన బంగారం చోరీ

image

భీమవరం నుంచి నరసాపురం వెళ్లేందుకు బస్సెక్కుతున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.