News February 1, 2025

సిరిసిల్ల: పట్టభద్రుల ఓటర్లు ఎంతమందంటే..!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 28 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 22 వేల 473 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి 13 మండలాల పరిధిలో 928 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారుల వద్ద 149 పట్టభద్రులు, 40 ఉపాధ్యాయుల ఓటర్ నమోదు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిశీలించి సకాలంలో డిస్పోస్ చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News November 7, 2025

తొర్రేడు: తండ్రిని హతమార్చిన తనయుడు

image

రాజమండ్రి మండలం తొర్రేడులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కూతురు వివాహం విషయంలో తండ్రి అప్పారావును కొడుకు వడిశెల సాయికుమార్ దారుణంగా హత్య చేశాడని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ గురువారం రాత్రి తెలిపారు. పెళ్లి విషయంలో చెల్లెలిని తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన సాయికుమార్ కూరగాయలు కోసే కత్తితో అప్పారావు పీక కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. సాయికుమార్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

News November 7, 2025

NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

image

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCO<<>>)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in/