News February 1, 2025

సిరిసిల్ల: పట్టభద్రుల ఓటర్లు ఎంతమందంటే..!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 28 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 22 వేల 473 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి 13 మండలాల పరిధిలో 928 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారుల వద్ద 149 పట్టభద్రులు, 40 ఉపాధ్యాయుల ఓటర్ నమోదు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిశీలించి సకాలంలో డిస్పోస్ చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News November 23, 2025

స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.

News November 23, 2025

బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

image

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.

News November 23, 2025

కోహెడ: మహిళలు శక్తి స్వరూపులు: కలెక్టర్

image

మహిళలు శక్తి స్వరూపులని ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాల్గొని ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సంఘటితమై ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలో నేడు మహిళలు రాణిస్తున్నారని అన్నారు.