News March 21, 2025

సిరిసిల్ల: పదోతరగతి పరీక్షలకు 99.8శాతం విద్యార్థుల హాజరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 99.8% విద్యార్థులు హాజరైనట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని (35) పరీక్షా కేంద్రాల్లో (6766) మంది విద్యార్థులకు (99.8%) హాజరుశాతంతో (6752) మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. (14) మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు పరీక్ష సజావుగా సాగిందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 23, 2025

VZM: పార్ట్ టైం టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కో ఆర్డినేటర్ మాణిక్యం తెలిపారు. JL ఫిజిక్స్ (పార్వతీపురం), TGT హిందీ (సాలూరు) పోస్టులకు పురుషులు, JL కామర్స్ (వియ్యంపేట), TGT ఇంగ్లిష్ (భామిని) పోస్టులకు మహిళా అభ్యర్థులు అర్హులు. ఈనెల 25న నెల్లిమర్ల డైట్ కళాశాల పక్కన ఉన్న అంబేడ్కర్ గురుకులంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

News November 23, 2025

టెన్త్, ఐటీఐ అర్హతతో 542 పోస్టులు

image

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 542 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల పురుషులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పీఈటీ/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.50, SC, STలకు ఫీజు లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ, సర్టిఫికెట్ జిరాక్స్‌లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 23, 2025

ఓరుగల్లులో ‘ఢీ’సీసీ కుంపటి..!

image

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులను నియమించింది. విధేయతకు ప్రాధాన్యం ఇస్తూ సామాజిక సమీకరణాలను పాటించింది. MHBD, జనగామలో ST మహిళలకు, WGLలో మైనార్టీ కోటాలో అయూబ్‌కు అధ్యక్ష పదవీ దక్కింది. కాగా మరో ఛాన్స్ కోసం చూసిన ఎర్రబెల్లి స్వర్ణకు చుక్కెదురైంది. తనకు రెండో సారి DCC ఇవ్వకపోవడంతో నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. సీతక్క మాత్రం తన అనుచరుడికి రెండో సారి DCC ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.