News March 21, 2025
సిరిసిల్ల: పదోతరగతి పరీక్షలకు 99.8శాతం విద్యార్థుల హాజరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 99.8% విద్యార్థులు హాజరైనట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని (35) పరీక్షా కేంద్రాల్లో (6766) మంది విద్యార్థులకు (99.8%) హాజరుశాతంతో (6752) మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. (14) మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు పరీక్ష సజావుగా సాగిందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 23, 2025
ప్రకాశంలో కలవనున్న ఆ నియోజకవర్గాలు.!

ప్రకాశం ప్రజల కోరిక నెరవేరే టైం దగ్గరపడింది. అటు మార్కాపురం జిల్లా కావాలన్నది 40 ఏళ్ల కల. ఇటు విడిపోయిన అద్దంకి, కందుకూరు కలవాలన్నది మూడేళ్ల కల. 2022లో జిల్లాల విభజన సమయంలో అద్దంకి, కందుకూరు ప్రజలు తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. కానీ బాపట్ల వైపు అద్దంకి, నెల్లూరు వైపు కందుకూరు వెళ్లాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో మళ్లీ ఇవి ప్రకాశం వైపు రానున్నాయి.
News November 23, 2025
ఏలూరు జిల్లా కలెక్టర్ వార్నింగ్

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లు, మెడికల్ కాలేజీ విద్యార్థులు గాని ఒక్క ఫిర్యాదు చేసినా వెనువెంటనే విచారణ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులకు సిబ్బంది అందించే సేవలపై వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
News November 23, 2025
ఉమ్మడి వరంగల్లో 1,708 పంచాయతీలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 మండలాల్లో మొత్తం 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ కోసం 15,006 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
WGL(11): 317 జీపీలు, 2,754 వార్డులు
HNK(12): 210 జీపీలు, 1,986 వార్డులు
జనగామ(12): 280 జీపీలు, 2,534 వార్డులు
మహబూబాబాద్(18): 482 జీపీలు, 4,110 వార్డులు
ములుగు(10): 171 జీపీలు, 1,520 వార్డులు
భూపాలపల్లి(12): 248 జీపీలు, 2,101 వార్డులు


