News February 1, 2025

సిరిసిల్ల: పరిశీలనకు స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

image

నీటి సరఫరా పరిశీలనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా జిల్లాలోని అన్ని గ్రామాలలో నీటి సరఫరాను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని స్పష్టం చేశారు.

Similar News

News November 25, 2025

పేదలకు సేవ చేయడమే మనందరి లక్ష్యం: MP కావ్య

image

పేదలకు సేవ చేయడమే మన అందరి లక్ష్యమని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఎంపీ అధ్యక్షతన జనగామ దిశా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల ఫలాలు ప్రతీ గడపకి అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

News November 25, 2025

సిరిసిల్ల: 3,740 మంది మందుబాబులపై కేసులు: SP

image

గడిచిన సంవత్సరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3,740 మందిపై కేసులు నమోదు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 25, 2025

మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

image

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు.