News February 7, 2025
సిరిసిల్ల: పొక్సో కేసులో ఇద్దరు యువకులకు రిమాండ్

బాలికల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, నర్మాలకు చెందిన ఇద్దరు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇన్స్టాలో సర్కులేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువకులను అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News November 6, 2025
ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News November 6, 2025
బెదిరింపు కాల్స్ వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ శబరిశ్

సైబర్ మోసగాళ్ల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. ఇటీవల ములుగులోని ఓ మెడికల్ షాపు యజమానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము డ్రగ్స్ ఇన్స్పెక్టర్లమని బెదిరించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 6, 2025
సిరిసిల్ల: ‘రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు’

సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.


