News March 17, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 113 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను SRCL కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో 113 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు.
Similar News
News March 18, 2025
లింగపాలెం కుర్రోడికి సినిమా హీరోగా ఛాన్స్

సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.
News March 18, 2025
భువనగిరి: హాస్టళ్లలో ఫిర్యాదు బాక్స్ల ఏర్పాటుకు సిద్ధం

సంక్షేమ వసతిగృహాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదుల పెట్టెలో వేయోచ్చు. కలెక్టర్ తనిఖీలకు వచ్చినప్పుడు, వారంలో ఒకసారి పెట్టెను తెరిచి అందులోని ఫిర్యాదులను చూసి పరిష్కారం చూపుతారు. కలెక్టరేట్లో ఫిర్యాదు పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.
News March 18, 2025
శశాంక్ సింగ్ IPL ఆల్ టైమ్ ఎలెవన్.. కెప్టెన్ ఎవరంటే?

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్ IPLలో తన ఆల్ టైమ్ ఎలెవన్ టీమ్ను ప్రకటించారు. గత 17 సీజన్లలో సత్తా చాటిన ప్లేయర్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. టీమ్ కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంచుకోగా విదేశీ ప్లేయర్ల కేటగిరీలో డివిలియర్స్, మలింగను ఎంపిక చేశారు.
జట్టు: సచిన్, రోహిత్ శర్మ(C), కోహ్లీ, సురేశ్ రైనా, డివిలియర్స్, ధోనీ, హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, బుమ్రా, మలింగ.
మీ టీమ్ కామెంట్?