News January 29, 2025

సిరిసిల్ల: ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి: మంత్రి

image

చేనేత అభయహస్తం పథకాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్, చేనేత జౌళి శాఖ అధికారులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను రైతులకు, పవర్ లూమ్ పరిశ్రమకు నిరంతరాయంగా అందించాలని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నియమాల ప్రకారం సంస్థను నడపాలన్నారు.

Similar News

News December 8, 2025

సంగారెడ్డి: ఒక్క సర్పంచికి కాంగ్రెస్ నుంచి 9 నామినేషన్లు

image

నాగల్ గిద్ద మండల కేంద్రంలో సర్పంచి పదవికి ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఒక్కొక్కరు ఉండగా, గ్రూపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ నుంచి ఏకంగా 9 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది బరిలో ఎంతమంది ఉంటారో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ గుంపు రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తోంది.

News December 8, 2025

అరుదైన ఘట్టంలో గోదావరోళ్ల సంతకం..!

image

స్వాతంత్ర్య భారత గతిని మార్చిన రాజ్యాంగ సభ తొలి సమావేశం (1946 డిసెంబర్ 8)లో తూ.గో తేజాలు ప్రకాశించించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ చారిత్రక ఘట్టంలో జిల్లాకు చెందిన దిగ్గజ నేతలు కళా వెంకటరావు, మొసలికంటి తిరుమలరావు పాల్గొని రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆ బృహత్తర క్రతువులో గోదావరి బిడ్డలు భాగస్వాములు కావడం జిల్లా ప్రజలకు ఎప్పటికీ గర్వకారణమే.

News December 8, 2025

చీరాలలో అన్నదమ్ములు అరెస్ట్..!

image

చీరాలకు చెందిన అన్నదమ్ములు దాసరి గోపి (32), దుర్గ (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాపట్ల SP ఉమామహేశ్వర్ వివరాల మేరకు.. చీపుర్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న వారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. 6 నెలలుగా జిల్లాలో బైక్‌లను దొంగిలిస్తున్నారు. చీరాల 1టౌన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 4 బైక్‌లను దొంగలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు రివార్డ్ అందించారు.