News January 29, 2025
సిరిసిల్ల: ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి: మంత్రి

చేనేత అభయహస్తం పథకాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్, చేనేత జౌళి శాఖ అధికారులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను రైతులకు, పవర్ లూమ్ పరిశ్రమకు నిరంతరాయంగా అందించాలని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నియమాల ప్రకారం సంస్థను నడపాలన్నారు.
Similar News
News December 14, 2025
Kerala: కమ్యూనిస్టులకు ఎదురుదెబ్బ!

కేరళ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా కనిపించింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని అధికార LDFకు ఈ ఫలితాలు షాకిచ్చాయి. UDF(కాంగ్రెస్) బలం పుంజుకుంది. 6 కార్పొరేషన్లలో 4, 86 మున్సిపాలిటీల్లో 54, 941 పంచాయతీల్లో 504 స్థానాలను గెలుచుకుంది. LDFకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు <<18552178>>తిరువనంతపురం<<>> కార్పొరేషన్లో NDA గెలిచింది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు షాక్ తప్పదనే చర్చ సాగుతోంది.
News December 14, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సహకరించండి: డీఎస్పీ

మెదక్ జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రజలు, సిబ్బంది సహకరించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శనివారం చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News December 14, 2025
హైదరాబాద్లో మెస్సీ.. PHOTO GALLERY

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.


