News January 27, 2025

సిరిసిల్ల: ప్రత్యేక అధికారుల నియామకం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఇన్‌ఛార్జి ప్రత్యేక పాలనాధికారిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఘా నియమితులయ్యారు. మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 26వ తేదితో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది.

Similar News

News September 13, 2025

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి జిల్లా మీదుగా సంబల్‌పూర్ (SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ SEPT 17 నుంచి NOV 26 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), SEPT 19 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో ఆగుతాయన్నారు.

News September 13, 2025

సర్వదర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

image

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. శనివారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, సర్వదర్శనం టోకెన్ల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ వద్ద భక్తులు బారులు తీరారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసే ప్రాంతం శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయింది.

News September 13, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

image

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.