News January 27, 2025
సిరిసిల్ల: ప్రత్యేక అధికారుల నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఇన్ఛార్జి ప్రత్యేక పాలనాధికారిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఘా నియమితులయ్యారు. మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 26వ తేదితో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి మున్సిపాలిటీలకు ఇన్ఛార్జిలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది.
Similar News
News November 21, 2025
ఖమ్మం: ‘సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోండి’

ఉమ్మడి జిల్లాలో ఆడ, మగ మొక్కజొన్న సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్ల విషయంపై వ్యవసాయ శాఖ కమిషనర్ గోపికి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షుడు రవిచందర్ ఫిర్యాదు చేశారు. అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని, అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తూ నష్టపరుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 21, 2025
శ్రీకాకుళం: ‘టెన్త్ పరీక్షల రాసే విద్యార్థులకు గమనిక’

టెన్త్ పరీక్షలకు వయసు చాలని విద్యార్థుల కండోనేషన్ ఫీజుకు వివరాలను సరి చూసి చెల్లించాలని DEO రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31.08.2025 నాటికి 14 సంవత్సరాలు నిండని విద్యార్థుల https://ose.ap.gov.in వెబ్ సైట్లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజామాన్యం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా టెన్త్ పరీక్షల ఫీజును నవంబర్ 30లోగా చెల్లించాలన్నారు.
News November 21, 2025
జాబ్ చేస్తున్నారా..? ఈ షిఫ్టు మహా డేంజర్!

ప్రస్తుతం కంపెనీని బట్టి డే, నైట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యంపై షిఫ్ట్ డ్యూటీల ప్రభావాన్ని పరిశీలిస్తే.. డే షిఫ్టులు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. అదే రొటేషనల్ షిఫ్టులు ప్రమాదకరమని, షెడ్యూల్ తరచూ మారితే శరీరం సర్దుబాటు చేసుకోలేదని హెచ్చరించారు. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.


