News April 7, 2025

సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.

Similar News

News November 13, 2025

MBNR: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఫీజు చెల్లింపులకు నేడే తుది గడువు

image

డా.బీ.ఆర్.అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో 2019-2024 మధ్య చేరిన డిగ్రీ 1వ, 3వ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించడానికి నవంబర్ 13 తుది గడువు అని పాలమూరు ఓపెన్ వర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే, 2022-2024 మధ్య MA, MCom, MSc కోర్సుల్లో చేరిన 2వ సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని వివరించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News November 13, 2025

చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

చింతపల్లిలో గురువారం 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం 17 డిగ్రీలు నమోదు కాగా.. గురువారం 12 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో, ఉష్ణోగ్రతలు మరింతగా దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలి పులి పంజాకు ప్రజలు గజగజలాడుతున్నారు.

News November 13, 2025

గాంధారిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 10.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మన్ దేవిపల్లి 11, ఎల్పుగొండ,బీబీపేటలో 11.1, నస్రుల్లాబాద్,లచ్చపేటలో 11.2, రామారెడ్డి,రామలక్ష్మణపల్లిలో 11.4, సర్వాపూర్ 11.5, డోంగ్లి 11.6, మేనూర్ 11.8, ఇసాయిపేట,జుక్కల్‌లో 11.9, బీర్కూర్ 12°Cలుగా నమోదయ్యాయి.