News February 28, 2025

సిరిసిల్ల: బావిలో పూడిక తీస్తున్న వ్యక్తి మృతి

image

ఓ బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురైన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ముస్తాబాద్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓల్లపు దేవరాజ్ (37) మండల కేంద్రానికి చెందిన నరసయ్య అనే రైతు వ్యవసాయ భూమిలో పూడికతీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో ఉన్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 7, 2025

స్మృతితో పెళ్లి రద్దు.. పలాశ్ ఏమన్నారంటే?

image

స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్‌ SMలో పోస్ట్ పెట్టారు. ‘పర్సనల్ రిలేషన్‌షిప్ నుంచి తప్పుకుంటున్నా. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాపై వచ్చిన నిరాధారమైన వదంతులు బాధించాయి. గాసిప్‌ల ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దనే విషయాన్ని సమాజం నేర్చుకోవాలి. నాపై తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News December 7, 2025

అనంతపురంలో అన్నదమ్ములు మృతి..!

image

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు నరేంద్ర(32), చరణ్(25) మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బ్రహ్మసముద్రం మండలానికి చెందిన చరణ్ కాలు జారి నీటికుంటలో పడ్డాడు. అన్న నరేంద్ర అతణ్ని కాపాడేందుకు నీటి కుంటలోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News December 7, 2025

ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

image

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.