News January 31, 2025

సిరిసిల్ల: బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మృతి

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్‌నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News November 2, 2025

MBNR: రేలింగ్‌లో తలదూర్చిన బాలుడు SAFE..!

image

ఆడుకుంటూ 167 జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన రేలింగ్‌లో ఓ బాలుడు తల ఇరుక్కుని అవస్థలు పడ్డ ఘటన గండీడ్ మండలం జానంపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వెన్నచేడ్ గ్రామానికి చెందిన నర్సింలు కుటుంబసమేతంగా మరో గ్రామానికి వెళుతున్న సమయంలో అతడి కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నట్టుండి రేలింగ్‌లో తలదూర్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి తలను బయటకు తీశారు.

News November 2, 2025

NLG: నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ..!

image

శాలిగౌరారం(M) ఆకారంలో ఉన్న 800 ఏళ్ల అతి పురాతనమైన సూర్య దేవాలయం నేడు శిథిలావస్థకు చేరింది. కట్టంగూర్ నుంచి 14KM దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామపంచాయతీ నుంచి తూర్పు దిశలో 2KM దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పరిపాలించారని ఇక్కడ ఉన్న శిలాశాసనం తెలుపుతుంది. వీళ్లు 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం క్రితం ఈ గుడిని నిర్మించారు. ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

News November 2, 2025

విజయవాడ: ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

image

APSSDC ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా స్కిల్ అధికారి ఎస్. శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 8వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులెవరైనా ఈ నెల 9లోపు పాలిటెక్నిక్ కాలేజీలో రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాలని, శిక్షణ పూర్తైన అనంతరం ఉద్యోగాలు కల్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.