News April 10, 2025

సిరిసిల్ల: మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపెరల్ పార్క్‌లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం చేస్తారన్నారు.

Similar News

News November 27, 2025

HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

image

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.

News November 27, 2025

NRPT: నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

image

ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.

News November 27, 2025

మల్లాపూర్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి, సాతారం, మొగిలిపేట, రాఘవపేట, కుస్తాపూర్, కొత్త దామరాజ్ పల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ పరిశీలించారు. నోటీస్ బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలన్నారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.