News April 10, 2025
సిరిసిల్ల: మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత: ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపెరల్ పార్క్లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం చేస్తారన్నారు.
Similar News
News February 7, 2026
ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు!

*U19 WC ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన తొలి క్రికెటర్ వైభవ్.
* ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోరు- 722 రన్స్ (ఇండియా-411, ఇంగ్లండ్-311)
*పరుగుల పరంగా ఫైనల్లో అతిపెద్ద విజయం- 100 రన్స్
*Youth ODIలో అత్యధిక సిక్సులు- 31
*ఛేజింగ్లో హయ్యెస్ట్ స్కోరు- 311 రన్స్(ఇండియాతో కలిసి ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది)
*ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
News February 7, 2026
MHBD: అభ్యర్థుల చుట్టూ జనాలే.. ఓట్లు ఎవరికో..?

మహబూబాబాద్, తొర్రూర్, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో జనాలు తిరుగుతున్నారు. ఈ ఓటర్లు చివరికి.. ఓటు ఎవరికి వేస్తారు ఎవరిని అందలం ఎక్కిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు. ఈనెల 13 వరకు వేచి చూడాల్సిందే.
News February 7, 2026
రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.


