News February 24, 2025

సిరిసిల్ల: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News November 4, 2025

అనకాపల్లి: ‘స్నాన ఘట్టాల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలి’

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో ఈనెల 5న శైవ క్షేత్రాల వద్ద గల స్నాన ఘట్టాలలో భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్ నుంచి పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల వద్ద క్యూలైన్లు, బారికెడ్లు నిర్మించాలన్నారు.

News November 4, 2025

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్

image

కాళేశ్వరం అభివృద్ధి పనులలో పురోగతి, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలని, నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని సూచించారు. పెండింగ్ పనులను సమయానికి పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 4, 2025

అన్నమయ్య: చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

image

పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలోని గుంజనేరు వద్ద విషాదం నెలకొంది. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు. మృతులు శీను (47), మల్లికార్జున (37)గా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.