News July 2, 2024

సిరిసిల్ల: మద్యానికి బానిసై యువకుడి మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐతం అజయ్(25) అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 5, 2025

చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్రమంత్రి

image

చొప్పదండి పట్టణానికి చెందిన తైక్వాండో ఛాంపియన్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పడకంటి కాశీ విశ్వనాద్, భూసారపు వెంకటేష్ గౌడ్, స్పందన, సౌమ్య, రామ్ చరణ్ అనే విద్యార్థులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఏడు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి రజిత పథకాలు సాధించారు.

News July 4, 2025

బహిరంగ ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు: KNR సీపీ

image

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు KNR CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఘర్షనలకు పాల్పడుతున్న మందుబాబులపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సీపీ పేర్కొన్నారు.

News July 4, 2025

KNR: కలెక్టరేట్‌లో ఘనంగా రోశయ్య జయంతి

image

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రోశయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో ఏడుసార్లు వరుసగా ఏపీ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య తమిళనాడు గవర్నర్ గా, ఏపీ సీఎంగా గొప్ప సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.