News April 10, 2025
సిరిసిల్ల: మద్య మానేరులో కేజీ కల్చర్ యూనిట్లను తనిఖీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేర్ రిజర్వాయర్ జలాశయ పరిధిలో గల చీరవంచలో ఫిషిన్ ఫార్మ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం తనిఖీ చేశారు. రిజర్వాయర్లో వృత్తాకార, పది 10 మీటర్ల డయా సర్క్యులర్ బోనులు, ఎనిమిది 5×5 మీటర్ల సైజు గల కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేసి, దానిలో దాదాపు 4.2 లక్షల విత్తనాలను నిల్వ చేశారు.
Similar News
News October 26, 2025
డాక్టర్ ఆత్మహత్య కేసు.. ప్రధాన నిందితుడు అరెస్టు

మహారాష్ట్రలోని సతారాలో SI తనను రేప్ చేశాడంటూ <<18091644>>డాక్టర్ ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ గోపాల్ బదానే అరెస్టయ్యారు. ఫల్టాన్ పోలీస్ స్టేషన్కు వచ్చి గోపాల్ లొంగిపోయారని ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. అతడిని సతారా జిల్లా కోర్టులో హాజరుపరచగా 4 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. కాగా అంతకుముందు మరో నిందితుడు ప్రశాంత్ బంకర్ను అదుపులోకి తీసుకున్నారు.
News October 26, 2025
జమ్మలమడుగులో భార్యాభర్తలు దారుణ హత్య

జమ్మలమడుగు- తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఇటికల బట్టి వద్ద కాపలాగా ఉన్న నాగప్ప పెద్దక్క అనే దంపతులపై శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడులు చేయడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చోరీ చేశారు. ఇది దొంగల పనేనని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 26, 2025
NLG: లక్ ఎవరిని వరిస్తుందో..!

కొత్త మద్యం పాలసీ నిర్వహణకు వేలైంది. ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 23వరకు మద్యం టెండర్ల దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. లక్కీడ్రా పద్ధతిలో సోమవారం షాపులు కేటాయించనున్నారు. ఇందుకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్లో ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ పరిశీలించారు.


