News April 10, 2025

సిరిసిల్ల: మద్య మానేరులో కేజీ కల్చర్ యూనిట్లను తనిఖీ చేసిన కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేర్ రిజర్వాయర్ జలాశయ పరిధిలో గల చీరవంచలో ఫిషిన్ ఫార్మ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్‌ యూనిట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం తనిఖీ చేశారు. రిజర్వాయర్‌లో వృత్తాకార, పది 10 మీటర్ల డయా సర్క్యులర్ బోనులు, ఎనిమిది 5×5 మీటర్ల సైజు గల కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేసి, దానిలో దాదాపు 4.2 లక్షల విత్తనాలను నిల్వ చేశారు.

Similar News

News November 17, 2025

పెద్దపల్లి: బైక్ అదుపుతప్పి బాలిక మృతి

image

PDPL(D) పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలం బోట్లవనపర్తికి చెందిన కత్తెర్ల లక్ష్మణ్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో ఇంటికి వెళ్తున్న క్రమంలో కాసులపల్లి వద్ద బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో పెద్దకూతురు సాయిపావని(13) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

News November 17, 2025

నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

image

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్‌లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్‌ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్‌ల నుంచి పై ఫొటోను డిజిటల్‌గా క్రాప్ చేశారు. బ్లూ కలర్‌లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్‌లో ఉన్నవి వలయాల నీడలు.

News November 16, 2025

ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.