News February 13, 2026

సిరిసిల్ల: మనమరాలి ఫోటో చూస్తూ కుప్పకూలిన తాత

image

తన కుమారుడి కూతురి దశదినకర్మకు వచ్చిన తాత హఠాత్తుగా మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కోనేటి ఎల్లయ్య (80).. పెద్ద కుమారుడు పోచయ్య కూతురు శిరీష కరీంనగర్‌లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈరోజు మండల కేంద్రంలో ఆమె దశదినకర్మ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లయ్య, మనమరాలి ఫోటో చూస్తూ ఒక్కసారి కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు.

Similar News

News March 7, 2026

సిరిసిల్ల: ‘ప్రజా పాలన’తో గ్రామాల్లో మార్పు: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి సమూల మార్పు తీసుకువస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 7, 2026

కరీంనగర్: ప్రజా పాలనపై మంత్రుల కీలక సమీక్ష!

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో.. జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో ఫైళ్ల పర్యవేక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.

News March 7, 2026

US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

image

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.