News February 3, 2025
సిరిసిల్ల: మహిళలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అక్క: ఎస్పీ

జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు భద్రతకు జిల్లా షీ టీం, పోలీస్ అక్క భరోసా కల్పిస్తున్నాయని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 03 కేసులు, 08 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే 8712656425 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
News November 18, 2025
గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.


