News February 5, 2025
సిరిసిల్ల: మాతా శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్

మాతా శిశు మరణాలను అరికట్టాలని SRCLకలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాత శిశు మరణాలు జరగకుండా మొదటిసారి గర్భం ధరించిన తర్వాత రిజిస్ట్రేషన్ నుంచి గర్భధారణ చెకప్ లు ఆశా కార్యకర్తల ద్వారా ఏఎన్ఎం ద్వారా చెకప్ లు సకాలంలో చేయించాలన్నారు.
Similar News
News January 22, 2026
EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్లాండ్ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్ల్యాండ్కు సంబంధించిన గోల్డెన్ డోమ్పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.
News January 22, 2026
HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

స్విట్జర్లాండ్లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్ను సీఎం రేవంత్ దావోస్లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్ను అధ్యయనం చేస్తామని తెలిపారు.
News January 22, 2026
నరసరావుపేట: ఇంటర్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జిరాక్స్ సెంటర్ల మూసివేత, పోలీస్ బందోబస్తు, ఫ్లైయింగ్ స్క్వాడ్లు, వైద్య శిబిరాలు, తాగునీరు, విద్యుత్, బస్సుల ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయని DIEO నీలావతి దేవి తెలిపారు.


