News March 27, 2025

సిరిసిల్ల: మాదకద్రవ్యాలను నిర్మూలించాలి: కలెక్టర్

image

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని గురువారం కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే సమక్షంలో అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలన్నారు.

Similar News

News October 20, 2025

మండపేట: బంగారు చీరలో అన్నపూర్ణమ్మ

image

మండపేటలోని బూరుగుంట చెరువు సమీపంలో ఉన్న అన్నపూర్ణ దేవిని బంగారు చీరలో అలంకరించారు. దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి బంగారు పూత పూసిన చీరతో అలంకరించడం ఇక్కడ ప్రతిఏటా ఆనవాతీగా వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

News October 20, 2025

రంప: 14 శతాబ్ద శివలింగం గురించి తెలుసా?

image

రంపచోడవరం నియోజకవర్గం రంపలోని శివాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని 14వ శతాబ్దంలో నాగవంశీయులు ప్రతిష్ఠించారని పెద్దలు చెబుతారు. బిట్రీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు సైతం ఈ శివలింగాన్ని పూజించారు. రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించడం మరో విశేషం. ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్లారా?

News October 20, 2025

ONGCలో 566 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ONGC 566 గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు <>www.iocl.com<<>> వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 31న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు డొమైన్ లాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ‌)పై పరీక్ష ఉంటుంది.