News March 19, 2025
సిరిసిల్ల: మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండకూడదు: కలెక్టర్

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి, సరఫరా, ల్యాబ్ను పరిశీలించారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను క్షుణ్నంగా కలెక్టర్కు మిషన్ భగీరథ ఇంజినీర్లు వివరించారు.
Similar News
News October 31, 2025
మంథని: మాజీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేసిన అధికారులు

మంథని మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య ఇంటిని శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఎరుకల ఏకలవ్య విగ్రహం ఎదురుగా కాటారం రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 314లో 23 గుంటల భూమిని లింగయ్య ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని కొందరు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు సదరు నిర్మాణాన్ని అధికారులు తాజాగా నేలమట్టం చేశారు.
News October 31, 2025
KMR: పత్తి కొనుగోళ్లు వాయిదా..సోమవారం షురూ

మద్నూర్ పరిధిలోని 7 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు KMR జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన కొనుగోలు ప్రక్రియ సోమవారం నాడు ప్రారంభం కానుంది. రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. శనివారం, ఆదివారం కొనుగోలు ప్రక్రియ జరగదని ఆమె స్పష్టం చేశారు.
News October 31, 2025
పర్యాటకులకు గుడ్ న్యూస్.. విజయవాడ-అరకు డైరెక్ట్ ట్రైన్

విజయవాడ మీదుగా అరకు-యలహంక మధ్య స్పెషల్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. NOV 14,18,24,25న యలహంక-అరకు, 13,17,23,24న అరకు-యలహంక మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. పై తేదీలలో యలహంక నుంచి మధ్యాహ్నం 1.30/2 గంటలకు, అరకులో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరతాయన్నారు. మార్గమధ్యంలో రాజమండ్రి, అనకాపల్లి, దువ్వాడ, తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.


