News April 3, 2025

సిరిసిల్ల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. ఆటకానితిప్పలో పక్షుల విన్యాసాలు!

image

సూళ్లూరుపేట- శ్రీహరికోట దారిలోని ఆటకానితిప్ప వద్ద పులికాట్ సరస్సులో వలస పక్షుల వేట విన్యాసాలు పక్షి ప్రేమకులను కట్టిపడేస్తాయి. సూళ్లూరుపేట నుంచి సూమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల విజ్ఞాన కేంద్రం ఆకట్టుకుంటుంది.

News January 10, 2026

ఆర్సీపురంలో దక్షిణాది రాష్ట్రాల సైన్స్ ఫెయిర్

image

సంగారెడ్డి జిల్లాలో దక్షిణాది రాష్ట్రాల సైన్స్‌ ఫెయిర్‌కు సన్నాహాలు పూర్తి చేసినట్లు DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆర్సీపురం మండలం కొల్లూర్‌లోని గాడియం పాఠశాలలో ఈ విజ్ఞానోత్సవం జరగనుంది. పాల్గొనే వారు ఈనెల 18 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

News January 10, 2026

మేడారంలో నెమలీకలు విక్రయంతో ఆదాయం!

image

మేడారంలో చిరు వ్యాపారుల నుంచి పెద్దవ్యాపారుల వరకు వనదేవతలు చల్లగా చూస్తారని ప్రగాఢ విశ్వాసం. చిరు వ్యాపారులు సైతం రాష్ట్రాలు దాటి మేడారంలో వస్తువులు విక్రయాలకు వస్తుంటారు. ఏ రోజు కూడా తాము నష్టపోలేదని అమ్మవార్ల సన్నిధిలో విక్రయించిన ప్రతి వస్తువుతో తాము సంతోషంగానే ఉన్నామని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి జాతరలో రూ.10కి నెమలీకలు విక్రయిస్తూ Way2News కెమెరాకు చిక్కాడు.