News April 3, 2025

సిరిసిల్ల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News December 13, 2025

వృద్ధురాలిపై అత్యాచారయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్: మొగల్తూరు SI

image

బీచ్‌ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసినట్లు మొగల్తూరు ఎస్ఐ వై. నాగలక్ష్మి తెలిపారు. గురువారం తోటలో పనులు చేసుకుంటున్న ఆమెపై పెద్దిరాజు(29) దాడి చేయగా.. బాధితురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.

News December 13, 2025

బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. J&Jకు రూ.360 కోట్ల షాక్!

image

బేబీ పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కంపెనీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు $40M(రూ.360 కోట్లు) చెల్లించాలంటూ కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. నాలుగు దశాబ్దాలుగా పౌడర్ వాడటంతో క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీపై 67 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

News December 13, 2025

భూపాలపల్లి: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గణపురం మండలం సీతారాంపురంలో బాలాజి రామాచారి తన భార్య సంధ్య (42)ను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకొని మృతి చెందాడు. మొదటి భార్య మరణించాక సంధ్యను వివాహం చేసుకున్నాడు. కూతురు, భార్య వేధింపులు తాళలేక ఈ దారుణానికి పాల్పడినట్లు వీడియో తీసి స్టేటస్ పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.