News April 3, 2025
సిరిసిల్ల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.
Similar News
News November 28, 2025
సిద్దిపేట: బాండ్పై సంతకం పెట్టి పోటీ చేయ్!

SDPT జిల్లా నంగునూర్ మం.లో సర్పంచ్లుగా పోటీచేస్తున్న ఆశావహులకు బాండ్ పేపర్ సవాల్ విసురుతోంది. వాట్సాప్ గ్రూప్లలో యువకులు బాండ్ను తెగ వైరల్ చేస్తున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే 5ఏళ్లలో తన కుటుంబ ఆస్తులు పెరిగితే పంచాయతీ జప్తు చేసుకోవచ్చని, పనుల కోసం వచ్చే ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయనని, జీపీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయనని, తప్పుడు లెక్కలు చూపనని సంతకం చేసి ఓట్లు అడగాలని బాండ్లో పేర్కొన్నారు.
News November 28, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష

కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలిపై 2024 ఆగస్టు 29న అత్యాచారయత్నం చేసిన కేసులో 7వ అదనపు జిల్లా జడ్జి స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ముద్దాయి వెంకటరమణకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్ఐ సునీత తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వకపోతే..?

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి.


