News February 26, 2025

సిరిసిల్ల: ‘యముడు పిలుస్తున్నాడు.. నేను చనిపోతున్నా’

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మంజుల, బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్(19) HYDలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి తనకు చదువు ఇష్టం లేదని చెప్పాడు. మంగళవారం ‘అమ్మానాన్న సారీ.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా బై..బై..’అంటూ సూసైడ్ నోట్ రాసి HYD కాచిగూడలో ట్రైన్ కిందపడి చనిపోయాడు.

Similar News

News December 6, 2025

GNT: రూ.10కి వ్యర్థాలు.. ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News December 6, 2025

నంద్యాల: ‘అమ్మా, నాన్న ఆశీర్వదించండి’

image

బండి ఆత్మకూరులోని ఏపీ మోడల్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశం సందర్భంగా పదో తరగతి విద్యార్థి ముబీనా వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే సూక్తిలో మొదటి రెండు స్థానాలు తల్లిదండ్రులవే. అందులో భాగంగా చిన్నారులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం పొందుతున్న చిత్రాన్ని చూసిన అతిథులు.. ముబీనాను అభినందించారు.

News December 6, 2025

కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలపై అవగాహన కల్పించరా.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం అన్ని సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. DEC 2-6 మధ్య తొలివిడత పరీక్షలు జరుగుతుండగా, ఎన్టీఆర్ జిల్లాలో 84 వేలు, కృష్ణాలో 50 వేల మంది అర్హులున్నారు. అయితే కొందరు నిరుద్యోగులు తమకు సమాచారం లేదని వాపోతున్నారు. అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీలు జాబ్స్ ఇవ్వనున్నాయి.