News February 26, 2025

సిరిసిల్ల: ‘యముడు పిలుస్తున్నాడు.. నేను చనిపోతున్నా’

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మంజుల, బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్(19) HYDలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి తనకు చదువు ఇష్టం లేదని చెప్పాడు. మంగళవారం ‘అమ్మానాన్న సారీ.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా బై..బై..’అంటూ సూసైడ్ నోట్ రాసి HYD కాచిగూడలో ట్రైన్ కిందపడి చనిపోయాడు.

Similar News

News November 17, 2025

మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

image

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.

News November 17, 2025

చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

image

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్‌ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.