News February 4, 2025
సిరిసిల్ల: రీల్స్ కోసం ఈతకు వెళ్లిన బాలుడి మృతి

ముస్తాబాద్(M)లో ఓ బాలుడు రీల్స్ కోసం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో రీల్స్ కోసం ఈత కొట్టాడు. చరణ్కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2026
అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
News January 10, 2026
మేడారం జాతరలో 3199మంది వైద్య సిబ్బంది

ఈ సారి మేడారం జాతరలో 3199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వీరిని నియమించుకుంటారు. మొత్తం 544 మంది వైద్యులలో 72మంది స్పెషలిస్టులు, 42మంది మహిళా డాక్టర్లు ఉంటారు. మరో 2150మంది పారామెడికల్ సిబ్బంది పని చేస్తారు. మేడారంలో 50పడకల ప్రధాన ఆస్పత్రితో పాటు 6 పడకలతో 30క్యాంపులు ఏర్పాటు చేస్తారు.


