News February 4, 2025
సిరిసిల్ల: రీల్స్ కోసం ఈతకు వెళ్లిన బాలుడి మృతి

ముస్తాబాద్(M)లో ఓ బాలుడు రీల్స్ కోసం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో రీల్స్ కోసం ఈత కొట్టాడు. చరణ్కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
NZB: మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేశారు: కవిత

తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News February 12, 2025
93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: శ్రీధర్ బాబు

రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించినట్టు సచివాలయంలో తనను కలిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి వివిరించారు. పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన 4 గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది.
News February 12, 2025
సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర

సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్రసంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.