News April 16, 2025
సిరిసిల్ల: లారీ ఢీకొని యువకుడి మృతి

కామారెడ్డి మండలం దేవునిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట్ మండలం నాగంపేటకు చెందిన వినోద్ కుమార్(30), అతని స్నేహితుడు దేవేందర్ కామారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఉగ్రవాయి మైసమ్మ వద్ద లారీ ఢీకొట్టింది. వారిని ఆసుపత్రికి తరలించగా వినోద్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News November 21, 2025
అనకాపల్లి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గ్రీవెన్స్

అనకాపల్లి కలెక్టరేట్ లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 13 మంది ఉద్యోగులు వారి సమస్యలపై కలెక్టర్ కు అర్జీలను సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
News November 21, 2025
నిర్మల్ జిల్లాలో దారుణం

జిల్లాలోని సారంగాపూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మల్లోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మృతి చెందింది. చించోలి(బి) గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం మగబిడ్డను ప్రసవించింది. శిశువును శుభ్రం చేస్తుండగా కబోర్డు మీదపడి శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆసుపత్రి నిర్వహకులు ఆ కుటుంబానికి నగదు చెల్లించి సర్దుబాటు చేసుకున్నారని స్థానికులు తెలిపారు.
News November 21, 2025
బాధ్యతలు స్వీకరించిన పార్వతీపురం జిల్లా అదనపు ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా నూతన అదనపు ఎస్పీగా ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా నూతన అదనపు ఎస్పీగా ఎం.వేంకటేశ్వర రావు నియమితులయ్యారు. ఈయన జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.


