News March 11, 2025

సిరిసిల్ల: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: రజిత

image

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఆశానోడల్ పర్సన్స్‌కు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌమార దశలో పిల్లలకు వారి యొక్క ఆరోగ్యం, శారీరక ఎరుగుదల, మానసిక ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్టు ఆమె స్పష్టం చేశారు.

Similar News

News February 16, 2026

కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

image

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 16, 2026

సంగారెడ్డి: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

image

మంజీర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. HYD రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ ఆదివారం స్నేహితుడితో కలిసి శివంపేట సమీపంలో నదిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమద్ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆచూకీ లభించలేదు.

News February 16, 2026

బాపట్లలో పీజీఆర్ఎస్ రద్దు: SP

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఫిర్యాదుల కోసం సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అర్జీదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.