News May 3, 2024

సిరిసిల్ల: వాహనం ఢీ.. బాలుడి మృతి

image

వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శుక్రవారం ఉదయం బాలుడు సూర హర్షవర్ధన్(6) రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో బొలెరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని స్థానికులు చెప్పారు.

Similar News

News December 18, 2025

అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరిపై కేసు: కేశవపట్నం ఎస్ఐ

image

శంకరపట్నం మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టివ్ నేషనల్ మెడికల్ మిషన్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కేశవపట్నం గ్రామంలో అంజయ్య, ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

News December 18, 2025

కరీంనగర్ డిఎంఅండ్ హెచ్‌వోకు ఆశా వర్కర్ల వినతి

image

ఆశా వర్కర్లకు క్షయవ్యాధి సర్వే పెండింగ్ బిల్లులు తక్షణమే అందించాలని కోరుతూ కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 18వ తేదీ నుండి లెప్రసీ సర్వే ప్రారంభం కానుందని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సర్వే బిల్లులు చెల్లించాకే విధులకు హాజరవుతామని హెచ్చరించారు.

News December 18, 2025

జమ్మికుంట మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

జమ్మికుంట మార్కెట్‌కు శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, శని, ఆదివారల్లో సాధారణ సెలవు ఉంటుందని తిరిగి మార్కెట్‌ సోమవారం ప్రారంభం అవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. గురువారం మార్కెట్‌కు రైతులు 19 వాహనాల్లో 144 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,450, కనిష్ఠంగా రూ.6,800 పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు రూ.100 పెరిగింది.