News March 1, 2025
సిరిసిల్ల: విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ప్రవీణ్

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీమ్ ఆర్మీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం డీఈఓ కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 15, 2025
నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్లైన్ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 15, 2025
8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

మహిళల క్రికెట్కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.
News November 15, 2025
WNP: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి బీసీ సంక్షేమశాఖ అండగా నిలుస్తోందని వనపర్తిజిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను 9,10వ తరగతుల బీసీ,ఈబీసీ విద్యార్థుల కోసం ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకంకింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అర్హులైన విద్యార్థులుతప్పనిసరిగా https://teలan-ganaepass.cgg.gov.in లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.


