News March 10, 2025

సిరిసిల్ల: సమర్థవంతంగా నిర్వహణ జరగాలి: మంత్రి

image

నీరు వృథా కాకుండా సమర్థవంతంగా సాగునీటి నిర్వహణ జరగాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులపై సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

Similar News

News December 16, 2025

జీకేవీధి: నిమిషాల వ్యవధిలో రోడ్డు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

image

జీకేవీధి మండలం తెనుములబండ గ్రామానికి చెందిన లకే బాబూరావు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. మంగళవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు. ఇందులో భాగంగా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వేదికపై కోరారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు. రూ.2కోట్లు కేటాయించి.. అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు

News December 16, 2025

కోడి గీతలతో YCP కోటి సంతకాల డ్రామా: సత్యకుమార్

image

AP: మెడికల్ కాలేజీల విషయంలో ప్రజా మద్దతు లేక YCP చీఫ్ జగన్ కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 10 వైద్య కళాశాలలను PPP విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్ దాన్ని ప్రైవేటీకరణగా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, కోర్టులు PPPని సమర్థించాయని, దీనిపై ఆయన కోర్టుకెళ్తేనే మేలని చెప్పారు.

News December 16, 2025

సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ

image

కొత్తగూడెం: సింగరేణి సంస్థ సీఎండీగా దేవరకొండ కృష్ణ భాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడేళ్ల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ భాస్కర్ మంగళవారం సింగరేణి భవన్‌లో బలరామ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు నూతన సీఎండీకి స్వాగతం పలికారు.